మూడోసారి కాలర్ ఎత్తని మహేష్!

Update: 2019-05-19 10:26 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకటి అరా ఏరియాలు తప్ప మిగతా చోట్ల మంచి కలెక్షన్స్ నమోదు చేసింది 'మహర్షి'.  అయితే 'మహర్షి' టీమ్ మాత్రం సినిమా విజయం పై ఫుల్ ఖుష్ గా ఉన్నారు.  ఈ సినిమాను ఎపిక్ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తూ రీసెంట్ గా విజయవాడలో విజయోత్సవం కూడా జరిపారు.

అయితే ఈ కార్యక్రమంలో మహేష్ కాస్త ఆచితూచి మాట్లాడడం విశేషం.  ఇప్పటికే 'మహర్షి' సినిమా విషయంలో రెండు సార్లు తన కలర్ ఎగరేశాడు. మొదటి సారేమో సినిమా రిలీజ్ అయిన తర్వాత కలర్ ఎగరేసి.. అభిమానులకు మాత్రమే కాదు.. తనకు కూడా ఇది కాలర్ ఎగరేసే సినిమా అని చెప్పాడు. సుదర్శన్ 35 థియేటర్ ను సందర్శించినప్పుడు మరోసారి కలర్ ఎగరేశాడు. దీంతో  విజయవాడలో  ముచ్చటగా మూడో సారి కూడా కాలర్ ఎగరేయడం ఖాయమని చాలామంది డిసైడ్ అయ్యారు. కానీ వారికి సర్ ప్రైజ్ ఇస్తూ కాలర్ ఎగరేయకుండానే తన స్పీచ్ ముగించాడు.

'మహర్షి' తనకు 25 చిత్రం కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్లను గుర్తు చేసుకునే క్రమంలో పూరి జగన్నాధ్.. సుకుమార్ పేర్లను మర్చిపోయిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత వారి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది.  ఈసారి అలాంటి ఛాన్స్ తీసుకోకుండా జస్ట్ డెబ్యూ సినిమా దర్శకుడు కె. రాఘవేంద్రరావు పేరును మాత్రం గుర్తుచేసుకున్నాడు.  చూస్తుంటే విజయోత్సవం లో మహేష్ తన కాస్త తన జోష్ ను తగ్గించుకుని మాట్లాడినట్టు అనిపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. మహేష్ తన సినిమా విషయంలో ఎగ్జైట్ కావడం తప్పేమీ లేదని.. అయితే ఈ సినిమా మహేష్ చెప్పేంత రేంజ్ లో ఏమీ లేదనే విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. 


Tags:    

Similar News