ఆమెకు మహేష్ - ఎన్టీఆర్ - చరణ్ విషెస్

Update: 2018-07-14 08:43 GMT
జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో భారతీయ క్రీడాకారిణి హిమదాస్ సంచలనం సృష్టించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో భారత్ కు స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఈ అరుదైన ఘనతను సాధించిన హిమ దాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ - రాంచరణ్ లు సోషల్ మీడియా ద్వారా హిమదాస్ ను అభినందించారు.

*గర్వంగా.. సంతోషంగా ఉంది : మహేష్ బాబు

‘భారత క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజయాల్లో ఇదీ ఒకటి.. హిమదాస్ అద్భుత ప్రతిభ కనబరిచింది.  చాలా గర్వంగా.. సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ హిమదాస్’ అంటూ మహేష్ ట్వీట్ చేసి అభినందించారు.

*హిమదాస్ చరిత్ర సృష్టించింది: ఎన్టీఆర్

‘చరిత్ర సృష్టించిన హిమదాస్ కు హృదయపూర్వక అభినందనలు.. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో స్వర్ణం నెగ్గిన అథ్లెట్ గా నిలిచారు. ఇది గొప్ప సంతోషకరమైన సమయం’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

*హిమదాస్ కు సెల్యూట్ : రాంచరణ్

‘హిమదాస్ కు సెల్యూట్.. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచారు. దేశం యావత్తు మీకు సెల్యూట్ చేస్తోంది’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో రాంచరణ్ పోస్ట్ చేశాడు.
Tags:    

Similar News