మనసున్న మహేష్..25లక్షల విరాళం..

Update: 2020-03-28 10:44 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరడుగుల అందగాడే కాదు.. మంచి మనసున్నవాడు కూడా. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న విషయం తెలిసిందే. దీనితో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ నియమాలకు కట్టుబడి ఉంది. ఇక కరోనా బారిన పడుతున్న బాధితుల సంఖ్య ఇండియాలో కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే ఈ కరోనా వ్యాధి నివారణకోసం బడా వ్యాపారవేత్తలతో పాటు సినీ హీరోలు ఫండ్స్ అందిస్తున్నారు. దేశంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొన్నా స్పందించేవారిలో మహేష్ బాబు ఒకరు.

ఇటీవల కరోనా బాధితుల సహాయం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయనిధి కింద చెరో 50లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ బాబు మరో 25లక్షల రూపాయలను టాలీవుడ్ సినిమాలకు పనిచేసే వర్కర్స్ కి విరాళంగా ప్రకటించారు. మహేష్ బాబు సేవా దృక్పధం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనను కొనియాడుతున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు కోటి ఇరవైయైదు లక్షలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. మహేష్ ని చూసి ఇంకా చాలామంది సినీ వర్కర్స్ కి విరాళం అందించడానికి ముందుకు వస్తారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News