శాతకర్ణి తరువాత కొత్తాళ్లే బెటర్

Update: 2017-02-20 07:51 GMT
దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఫుల్ ఫాంలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సక్సెస్ లు సాధించడలేడనే విమర్శలకు కూడా.. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో సరైన సమాధానం ఇచ్చేశాడు. ఈ మూవీ తర్వాత క్రిష్ చేయబోయే ప్రాజెక్టుపై చాలానే అంచనాలు ఉండగా.. రకరకాల ప్రాజెక్టులు వార్తల్లోకి వచ్చాయి.

వెంకటేష్ తో ఓ సినిమా చేస్తామంటూ.. అధికారికంగానే క్రిష్ టీం వెల్లడించింది. కానీ కాపీ రైట్ సమస్యలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గతేడాది ఆగిపోయిన రాయబారిని.. మళ్లీ పట్టాలెక్కిస్తాడనే టాక్ వచ్చింది. దాని సంగతి తేలలేదు. శ్రీకృష్ణ దేవరాయలు.. గౌతమబుద్ధుడు జీవితాలపై బయోపిక్స్ తీస్తానని క్రిష్ చెప్పాడు కానీ.. ఈ ప్రాజెక్టులు ఇప్పట్లో తేలే వ్యవహారాలు కాదు. ఇప్పుడు వీటిన్నిటినీ కట్ట కట్టి కప్ బోర్డులో పెట్టేసి చక్కగా కుర్ర హీరోలతో కాని కొత్త కుర్రాళ్ళతో కాని సినిమా చేసుకోవడం బెటర్ అని ఫిక్సయ్యాడట

ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న ఇద్దరు కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ మాదిరిగా మూవీ ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. వాళ్లు ఊ ఆ అంటే మాత్రం కొత్త కుర్రాళ్ళతో చేసుకుంటాడట. ఇక గతంలో మాదిరిగా కేవలం థీమ్ బేస్డ్ గా కాకుండా.. ఈసారి తన సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికైతే ఏ జోనర్ లో మూవీ తీయబోతున్నాడో తెలియలేదు కానీ.. క్రిష్ కొత్త సినిమా మాత్రం కుర్ర హీరోలతోనే అనే విషయం మాత్రం కన్ఫాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News