వైరస్‌ పై వేమన పథ్యం షేర్‌ చేసిన డైరెక్టర్‌

Update: 2020-06-18 09:50 GMT
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మహమ్మారి వైరస్‌ గురించిన చర్చ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో దీని గురించి ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు లక్షల్లో దీని గురించి కొత్త పోస్ట్‌లు వస్తున్నాయి. కొందరు క్రియేటివిటీతో పోస్ట్‌లు క్రియేట్‌ చేస్తుంటే కొందరు ఫన్నీగా క్రియేట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి పంథా వారిది. తాజాగా ఈ మహమ్మారిపై ఎవరో రాసిన వేమన పద్యాలను దర్శకుడు క్రిష్‌ ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు. అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వైరస్‌ గురించి అవగాహణ కల్పిస్తూ ఉన్న ఆ వేమన పద్యాలు చాలా అర్థవంతంగా ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ పద్యాలను తాను రాయలేదని క్రిష్‌ క్లారిటీ ఇచ్చాడు. విశ్వదాభిరామా వినుర వేమ వైరస్‌ పై వేమన శతకం అంటూ ఇది మా సిద్దార్థ ఫార్మసీ కాలేజీ గ్రూప్‌ లో వచ్చినది. దీని ఒరిజినల్‌ సోర్స్‌ ఎవరు రాశారు అనేది నాకు తెలియదు అంటూ ఈ ఫొటోను షేర్‌ చేశాడు.
Tags:    

Similar News