అయోధ్య వేళ.. మోడీపై ప్రముఖ నటి సెటైర్లు

Update: 2020-08-05 11:50 GMT
అయోధ్యలో శ్రీరామాలయం నిర్మాణానికి భూమి పూజ పూర్తయ్యింది. దశాబ్ధాల హిందువుల కల నెరవేరినందుకు సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే మోడీని దేశంలోనే యుగ పురుషుడిగా అభివర్ణిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హిందువుల కల నెరవేరుస్తున్న మోడీని హీరోగా అభివర్ణిస్తున్నారు.

ఈ క్రమంలోనే కర్ణాటకలోని చిక్కగులూరు బీజేపీ ఎంపీ శోభ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘బాల రాముడి చేతిని అందిపుచ్చుకొని మందిరం వైపు మోడీ నడిపిస్తున్న చిత్రం ’ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి తన ప్రియమైన రాజును ఇంటికి తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ను ప్రముఖ నటి, వివాదాస్పద కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘వావ్.. ఇప్పుడు దేవుడైన రాముడి కంటే మోడీ పెద్దవాడయ్యరన్నమాట.. కలియుగం మరీ’ అని భావం వచ్చేలా సెటైర్ వేశారు. ఇప్పుడు ఖుష్బూ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
Tags:    

Similar News