తాను మర్డర్ చేయలేదంటున్న హీరోయిన్

Update: 2016-10-22 05:22 GMT
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన కహానీ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఓ గర్భవతి భర్త మిస్ అయితే.. అతన్ని వెతుక్కుంటూ ఆ భార్య పడ్డ కష్టాలను దర్శకుడు సుజోయ్ చూపించిన తీరు.. విద్యాబాలన్ నటనకు ముచ్చటపడ్డ సినీ అభిమానులు.. పెట్టుబడికి పది రెట్లకు పైగా లాభాలు కట్టబెట్టేశారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ గా కహానీ2 వస్తోంది. 36 సంవత్సరాల వయసు గల దుర్గారాణి సింగ్ కి వాంటెడ్ పోస్టర్ వేసి ఫస్ట్ లుక్ తోనే ఆసక్తి కలిగించారు.

ఇప్పుడీ కహానీ2కి టీజర్ కూడా వచ్చేసింది. అలాగని విద్యాబాలన్ చేస్తున్న రోల్ కి.. ఎందుకు వాంటెడ్ పోస్టర్ వేశారో తెలుస్తుందని అనుకోకండి. మైండ్ లో ఉన్న ప్రశ్నలు ఇంకా పెరిగిపోతోయ్ కూడా. 'నేను ఎవరినీ మర్డర్ చేయలేదు. కిడ్నాప్ చేయలేదు. నన్ను ఇరికించారు. ఇది అబద్ధం' అని విద్యాబాలన్ చెబుతున్నంతలోనే పోలీస్ సైరన్ మోగడం.. ఈమె పరిగెట్టుకుంటూ పారిపోవడం.. ఇదే టీజర్ అంతే.

ట్రైలర్ ను అక్టోబర్ 25న విడుదల చేస్తామని చెప్పి.. మరో మూడు రోజుల పాటు వెయిటింగ్ లో పెట్టేసింది విద్యాబాలన్. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించనున్న కహానీ2.. డిసెంబర్ 2న విడుదల కానుంది.

టీజర్ చూడటానికి క్లిక్ చేయండి


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News