అచ్చు అన్నీ శ్రీదేవి లాగానే!!

Update: 2018-05-05 07:55 GMT
తల్లి తర్వాత తల్లిలా చూసుకోవడం భార్య తన బాధ్యతగా భావిస్తుంది. అలాగే భార్య చనిపోతే ఆ తరువాత ఆ వ్యక్తిని తల్లిలా కాపాడుకునే వ్యక్తి కూతురు అనడంలో సందేహం లేదు. స్క్రీన్ మీదే కాదు.. రియల్ లైఫ్ లోను ఇలాంటి వాళ్లు ఉంటారు. బోనీ కపూర్ ను ఎంతో పదిలంగా చూసుకునేది భార్య శ్రీదేవి.

ఆయన కోరాలే కానీ.. ఎప్పుడూ వెన్నంటే ఉండేది. భర్తకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచిన శ్రీదేవి.. ఇప్పుడు తిరిగి రాని లోకాలకు తరలిపోయింది. గతేడాది మామ్ చిత్రానికి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును శ్రీదేవికి ప్రకటించారు. ఈ సందర్భంగా విజ్ఞాన భవన్ లో జరిగిన కార్కక్రమంలో తల్లికి బదులుగా.. ఆ అవార్డును అందుకునేందుకు కూతుళ్లు జాన్వి.. కుషి కపూర్ లు వచ్చారు. వీరితోపాటు తండ్రి బోనీ కపూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో బోనీ కపూర్ తలపై చెమటలు పడితే.. జాన్వి కపూర్ తుడుస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కొన్నేళ్ల క్రితం బోనీ కపూర్ తలపై పట్టిన స్వేదాన్ని ఇలాగే శ్రీదేవి తుడుస్తుండడం కెమేరా కంట పడింది. ఇప్పుడు సేమ్ సీన్ లో బోనీ కపూర్ కొంత వయసు పైబడి ఉన్నాడు. భార్య ప్లేస్ లో కూతురు జాన్వి వచ్చి చేరిందంటే. చూసేందుకు మాత్రమే కాదు.. అన్ని రకాలు గాను అమ్మను అచ్చు గుద్దినట్లుగా దింపేసినట్లుగా ఉంది జాన్వి అంటున్నారు సోషల్ మీడియా జనాలు.
Tags:    

Similar News