భామ సరే అంటే షూటింగ్ షురూ!

Update: 2019-04-19 07:52 GMT
అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మొదట్లో చాలామంది హీరోయిన్ల పేర్లు  వినిపించాయి కానీ ఫైనల్ గా మాత్రం 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వానిని ఫిక్స్ చేసుకున్నారట.  కానీ కియారా మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్టుకు 'యస్' చెప్పే పరిస్థితిలో లేదట.

కియారాకు ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'.. అక్షయ్ కుమార్ సినిమా 'గుడ్ న్యూస్' లో నటిస్తోంది.  'కబీర్ సింగ్' జూన్ లో రిలీజ్ అవుతోంది.  'గుడ్ న్యూస్'  కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది.  కానీ చర్చల దశలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉండడంతో అఖిల్ సినిమాకు సైన్ చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదట.  అందుకే కొంతకాలంగా తెలుగు సినిమాలేవి సైన్ చేయలేదని సమాచారం.  కానీ గీతా ఆర్ట్స్ టీమ్ కియారాను ఈ సినిమాలో నటింపజేసేందుకు గట్టిప్రయత్నాలే చేస్తోందని టాక్.  

#అఖిల్ 4 ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు అంతా సిద్ధంగా ఉందని.. హీరోయిన్ కనుక ఫైనలైజ్ అయితే చాలు షూటింగ్ షురూ చేస్తారని అంటున్నారు.  మరి గీతా ఆర్ట్స్ సినిమాకు కియారా యస్ చెప్తుందా లేదా అనేది వేచి చూడాలి.  ఒకవేళ కియారా ఈ సినిమాకు సైన్ చేయని పక్షంలో అఖిల్ కోసం మరో హీరోయిన్ ను వెతకాల్సి ఉంటుంది.  
    
    
    

Tags:    

Similar News