ఆ లేఖతో క్రిష్‌ జన్మ ధన్యమైంది

Update: 2017-02-24 17:14 GMT
పాతాళ భైరవి.. మాయాబజార్.. వంటి అమూల్యమైన సినిమాలను తెలుగు జాతికి అందించిన ఘనుడు కదిరి వెంకట రెడ్డి ఎలియాస్ కె.వి.రెడ్డి. ఆయన పేరు మీదనే కెవి రెడ్డి స్మారక అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి సినిమాను తీసిన క్రిష్‌ కు అందించనుండటంతో.. ఒక సీనియర్ దర్శకుడు ఇప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఒక లేఖ రాశారు.

గతంలో కెవి రెడ్డి దగ్గర పనిచేసి.. ఆ తరువాత తాను కూడా నేషనల్ అవార్డులను అందుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇప్పుడు ఆయన క్రిష్‌ ను అభినందిస్తూ ఒక ఉత్తరం రాశారు. గమ్యం సినిమాను చూసినప్పుడే క్రిష్‌ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళే దర్శకుడని అనుకున్నానని.. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వరకు ఆ ప్రయాణం అట్లాగే కొనసాగుతోందంటూ అయన కొనియాడారు. అంతేకాదు.. క్రిష్‌ లో ఉన్న క్వాలిటీస్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

తన స్వహాస్తాలతో సింగీతం రాసిన ఆ ఉత్తరాన్ని ఒక జీవితకాలపు జ్ఞాపకంగా పదిలంగా దాచుకుంటానని క్రిష్‌ కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. తన జన్మ ధన్యం అయ్యిదంటున్నాడు క్రిష్‌. మున్ముందు ఇలాగే తెలుగువారు గర్వపడే చిత్రాలను క్రిష్‌ తీస్తాడని తీస్తూనే ఉంటాడని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News