సౌండ్ లేకుండా సైగ‌ల్ని ఎంజాయ్ చేయ‌మన్న స్వీటీ

Update: 2020-09-24 08:51 GMT
అవును .. స్వీటీ అనుష్క శెట్టి ఇక‌పై సౌండ్ ని పాస్ చేసి సైగ‌ల్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తాన‌ని అంటోంది. తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థ్రిల్లర్ `నిశ్శ‌బ్ధం` అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ ‌కు సిద్ధమైంది. ఈ మూవీ చూస్తే అందుకు ఆస్కారం ల‌భిస్తుంద‌ని హింట్ ఇచ్చింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్ట్ ‌గా నటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ‌లో ఆమె సంకేత (సంజ్ఞ‌లు లేదా సైగ‌లు) భాషలో కమ్యూనికేట్ చేయడం ఆక‌ట్టుకుంది.

ఈ బుధ‌వారం అంతర్జాతీయ సంకేత (సైన్.. సైగ‌లు) భాషా దినోత్సవం సందర్భంగా అనుష్క ఇన్ ‌స్టాగ్రామ్  లో తన అభిమానులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని షేర్ చేసింది. ``నిశ్శబ్దాన్ని శక్తివంతం చేయండి.. ధ్వనిని పాజ్ చేయండి.. సైలెన్స్ ని అభినందిస్తున్నాం`` అని అనుష్క పోస్ట్ చేసింది.

మాధవన్- అంజలి- సుబ్బరాజు- శాలిని పాండే- హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడ్సెన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్- టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వ‌హించారు. మ్యూట్ ని ఆస్వాధించేందుకు ఇంకో వారం ఆగితే చాలు!
Tags:    

Similar News