చంపేసిన తెలుగోడి కథ.. సినిమాగా..

Update: 2017-04-25 04:28 GMT
అమెరికా.. ఇది చాలా మంది ఇంజినీర్ లా డ్రీమ్. బాగా బతకాలి అని కలలు కన్నా చాలా మంది ప్రపంచం తో పోటీపడాలి అనుకునే ప్రతీవాడు అమెరికా గురించి అక్కడ లైఫ్ గురించి కలలుకంటారు. మన తెలుగు వాళ్ళు అక్కడ ఏకంగా పాగా వేశారు అనుకోండి. అమెరికాలో వలస బతుకులు ఎంత దుర్బరoగా భయానకంగా ఉంటాయో ఈ ఏడాది తొలి నెలలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ.

తెలుగు సంతతికి చెందిన శ్రీనివాస్ కుచీబొట్ల అనే ఒక ఇండియన్ ఇమ్మిగ్రంట్ ని అక్కడ వివక్షత  పొట్టన పెట్టుకొంది. నైట క్లబ్ లో తెల్లజాతీయుడు అతన్ని కాల్చి చంపాడు.  ఆ సంఘటన మొత్తం దేశాన్ని భయపెట్టింది. ఇక్కడ నుండి వెళదాం అనుకున్న వాళ్ళకు ఒక్క పెద్ద షాక్. యూ‌ఎస్  ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకున్నారు. హాలీవుడ్ వాళ్ళకి ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ దొరకడమే లేటు.. వెంటనే ఒక కథ తయారు చేస్తారు. అలానే ఈ  రియల్ కథను  కూడా ఒక సినిమాగా  చేద్దాం అని రెడీ అవుతున్నారు. ''రే ఆఫ్ హోప్'' అనే పేరు తో శ్రీనివాస్ స్టోరీని సినిమాగా మలచనున్నారు.

డావే పిన్న్ ఈ సినిమాకు డైరెక్టర్ గా.. పీపుల్ మీడియా మరియు పీపుల్ టెక్ గ్రూప్ కలిసి నిర్మించబోతున్నాయీ. ఈ సినిమాను అమెరికా అంతటా అన్ని ప్రాంతాల్లోనూ షూట్ చేస్తారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News