ఇక గ్లామర్ హీరోయిన్ ఆస్తుల పంపకం

Update: 2016-10-24 05:32 GMT
గ్లామర్ హీరోయిన్ గా వెలిగిపోయిన పర్వీన్ బాబీ.. 11 ఏళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో.. ముంబైలోని తన అపార్ట్ మెంట్ లోనే మరణించింది పర్వీన్. అయితే.. ఈమె ఆస్తులకు సంబంధించిన కేసుపై ఇప్పుడు తీర్పు వచ్చింది.

పర్వీన్ బాబీ వీలునామా రాసిన ప్రకారమే ఆమె ఆస్తులను పంచాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆమె మరణం నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. తన ఆస్తిలో 80 శాతం అనాథ మహిళలు-పిల్లలకు చెందాలని.. మిగిలిన 20 శాతం మేనమామ మురాద్ ఖాన్ దక్కాలని పర్వీన్ 2002లోనే వీలునామా రాసింది. ఆమె మృతి తర్వాత 2005లో కోర్టుకు ఈ వీలునామాను సమర్పించాడు మేనమామ మురాద్ ఖాన్. కానీ ఇది ఫేక్ అని.. చనిపోయేందుకు 3ఏళ్ల ముందు రాసిన వీలునామా చెల్లదని.. పర్వీన్ బాబీ బంధువులు కోర్టులు ఆశ్రయించారు.

ఇప్పుడు తమ పిటిషన్ ఆ బంధువులు ఉపసంహరించుకోవడంతో.. కోర్టు తీర్పు తేలికైంది. ఎట్టకేలకు ఆమె కోరిక మేరకు వీలునామా ప్రకారమే ఆస్తుల పంపకానికి అందరూ అంగీకరించారు. స్వర్గంలో ఉన్ ఆమె ఆత్మ ఇప్పటికి శాంతించి ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News