ఎస్‌ చెప్పలేదు! నో చెప్పలేను!!

Update: 2015-07-10 10:41 GMT
అలనాటి మేటి నటి గౌతమి 'పాపనాశం' చిత్రంతో కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. పున:ప్రవేశం ఘనంగా జరిగింది. తొలిసినిమానే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. పాపనాశం రిలీజైన తొలి మూడురోజుల్లోనే రూ.25కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా పేరు తెచ్చుకుంది. అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత గౌతమి తిరిగి సినీఆరంగేట్రం చేయడంపై అభిమానులు బోలెడంత ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. ఇక నుంచి సినిమాల్లోనే కొనసాగుతారా? అని ఉత్సాహాన్ని ఆపుకోలేక గౌతమిని ప్రశ్నిస్తున్నారు.

దీనికి 'ఎస్‌' అని చెప్పకపోయినా 'నో' అని చెప్పలేనని గౌతమి అన్నారు. ఛాలెంజింగ్‌ రోల్స్‌ వస్తే చేస్తాను. అయినా నేను ఖాళీగా ఉన్నానని ఎవరు చెప్పారు. పరిశ్రమని వదిలి నేనెప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు. నటనను ఆపాను కానీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కొనసాగుతూనే ఉన్నా. ప్రస్తుతం నా కూతురిని బాగా చదివించుకుంటున్నా. త్వరలోనే వెండితెరకి తను కూడా పరిచయం అవుతుందని గౌతమి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గౌతమికి తెలుగు నాట కూడా వీరాభిమానులు ఉన్నారు. కమల్‌హాసన్‌, నాగార్జున సరసన గౌతమి అప్పట్లో నాయికగా నటించారు. ఆ సినిమాలన్నీ చూసి అభిమానం పెంచుకున్నారు. కాబట్టి మన దర్శకులు అత్త, అక్క క్యారెక్టర్లనే కాస్త ఛాలెంజింగ్‌గా చూపిస్తానంటే గౌతమి ఇక్కడా నటించే అవకాశం లేకపోలేదు.



Tags:    

Similar News