తమన్నాపై ఫిర్యాదు చేసిన నిర్మాత!

Update: 2016-09-30 07:08 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఈమెపై ఒక నిర్మాత ఫిర్యాదు కూడా చేశారు. వేరే సినిమాకు ఫుల్ ప్రమోషన్ చేసిన ఆమె, తన సినిమాకు మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయలేదని.. ఈ విషయంపై విచారణ జరపాలని ఆ నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బ్యానర్ లో నటించిన చిత్రానికి ఎందుకు ప్రమోషన్ చేయలేదో తెలపాలని ఆయన ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

వివరాళ్లోకి వెలితే... తమన్నాపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘానికి నిర్మాత ఆర్కే సురేష్ ఫిర్యాదు చేశారు. విజయ్ సేతుపతి హీరోగా "ధర్మదురై" అనే చిత్రాన్ని నిర్మించారు ఈ నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే కాసులు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందుగానీ, తర్వాత కానీ హీరోయిన్ తమన్నా ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనలేదట. కానీ.. ఆమె తాజా చిత్రం "అభినేత్రి" ప్రమోషన్‌ ల్లో మాత్రం ఫుల్ హంగామా చేస్తుందట. దీంతో సదరు ప్రొడ్యూసర్‌ కి ఫుల్ కోపం పుట్టుకొచ్చి, నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు.

అయితే ఈ విషయంలో విచారణ జరపాల్సిన ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్‌ తో తమన్నా తాజాగా "కత్తి సందై" సినిమాలో నటిస్తోంది. దీంతో ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News