మెగా టీమ్‌ అంతా ఎక్కడికో వెళ్ళొస్తోందే..

Update: 2016-05-27 05:31 GMT
అదిగో అక్కడ చూడండి.. ఎయిర్ పోర్టులో ఎరైవల్స్ లో కనిపిస్తున్నారు ఓ ముగ్గురు ఉద్దండులు. ఒకరు మన మెగాస్టార్‌ చిరంజీవి. ఇంకొకరు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌. పక్కనే మరో వ్యాపారవేత్త కమ్‌ చుట్టం.. అల్లు అరవింద్‌. అసలే ఈ మధ్య కాలంలో మెగా అండ్‌ అల్లూ ఫ్యామిలీలకు కాస్త చెడింది అనే వార్తలు వస్తున్న తరువాత.. ఇప్పుడు వీరు ఇలా కలసి రావడం చూస్తుంటే.. అసలు ఏం జరుగుతోంది అనే సందేహం రాక మానదు.

ఒక ప్రక్కన చిరంజీవి బ్లాక్‌ షర్ట్ అండ్ జీన్స్ క్యాజువల్స్ లో మెరిసిపోతుంటే.. వెనుకే ఉన్న నిమ్మగడ్డ అండ్ అల్లు అరవింద్‌ లు మాత్రం.. చాలా ఫార్మల్‌ గా రెడీ అయి ఉన్నారు. అంటే ఏదో బిజినెస్‌ మీటింగ్‌ కు వెళ్లొస్తున్నట్లున్నారు. ఇక ఈ ముగ్గురూ గతంలో మా టివిలో పార్టనర్స్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా కాస్త షేర్‌ పెట్టుకొని అధిక భాగాన్ని స్టార్‌ వారికి అమ్మేశారు. ఈ తరుణంలో అసలు మెగా టీమ్‌ అంతా ఎక్కడికి వెళ్ళినట్లు అంటే.. స్టార్‌ వారు ఆఫర్‌ చేసిన ఆ 800 కోట్లు పంచుకోవడానికేమో అనే సందేహం రాక మానదు. అలాగైతే కింగ్ నాగార్జున ఎక్కడబ్బా? ఆయన కూడా అతి పెద్ద షేర్‌ హోల్డర్‌ కదా!!

ఏ మాటకు ఆ మాటే చెప్పాలంటే.. చిరంజీవి లుక్స్ మాత్రం చంపేస్తున్నాయి. ఆ 150వ సినిమా ఏదో త్వరగా తీసుకురండి మాష్టారూ!!
Tags:    

Similar News