చిరు సెలక్షన్‌ ఆ నలుగురు హీరోయిన్లే

Update: 2015-08-27 15:52 GMT
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఫ్యాన్స్‌ కోరిక మేరకు అతడు ఓ డ్యాన్సింగ్‌ స్టార్‌ గా మరోసారి కనిపించడానికి రెడీ అవుతున్నారు. శంకర్‌ దాదా తరహా చిత్రంలోనే నటిస్తానని ఇదివరకే చిరంజీవి ప్రకటించారు. ఇప్పుడు టైమ్‌ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన కథ ఫైనల్‌ అయితే ఇక సెట్స్‌ కెళ్లడమే తరువాయి అని మెగాస్టార్‌ చెప్పారు. అయితే ఈ చిత్రంలో నటించే కథానాయికలు ఎవరు? అన్నదానిపై ఫిలింనగర్‌ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

మీరు మెచ్చే కథానాయికలు ఎవరు? అన్న ప్రశ్న చిరునే అడిగితే ఏమని సమాధానమిచ్చారో తెలుసా? అనుష్క - సమంత - నయన్‌ - తమన్నా ఈ నలుగురిలో ఎవరో ఒకరు అయి ఉంటారు.. అని అన్నారు. అంటే చిరు సరసన నటించే సత్తా ఆ నలుగురికి మాత్రమే ఉందనేది దీని అర్థం. ఈ జాబితాలో చరణ్‌ నాయిక తమన్నా పేరు కూడా ఉండడం విశేషం. మిల్కీ చరణ్‌ సరసన రచ్చ సినిమాలో నాయికగా నటించింది.

అసలు ఈ వయసులో మీరు యువహీరోలతో పోటీపడి డ్యాన్సులు చేయగలరా? అన్న ప్రశ్నకు.. చరణ్‌ తో పోటీ పెట్టండి. నేనేంటో చూపిస్తా అని చిరు తనదైన శైలిలో స్పందించారు. అంటే పై నలుగురు నాయికలు నాతో డ్యాన్సుల్లో పోటీపడాలంటే ముచ్చెమటలే అని చెప్పకనే చెప్పారు మెగాస్టార్‌.
Tags:    

Similar News