​చిరు నుండి బోయపాటికి ఫోనొచ్చింది

Update: 2017-06-23 04:04 GMT
తెలుగు సినిమా మహారాజు చిరంజీవికి ఖైదీ 150 సినిమాతో జనాలు ఘనంగానే స్వాగతం చెప్పారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ ఏమైయుంటుందో ఎలాంటి కథతో మళ్ళీ వస్తాడో అని అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇలా అనుకుంటున్న కొన్ని నెలలుకు  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే ఒక  వీరుడు కథ తో వస్తునట్లు తెలిసింది. దాదాపుగా 9 నెలలు తరువాత మళ్ళీ షూటింగ్ కు వెళ్లబోతున్నాడు చిరు. అయితే ఆ తరువాత ఆయన 152 వ చిత్రం మాత్రం ఇంత ఆలస్యం జరగదు అని తెలుస్తుంది.

ఉన్నట్లుండి ఒక ఫోన్ కాల్ రావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను ఉలిక్కిపడ్డాడట. నా కోసం ఒక కథ సిద్దం చేసి ఉంచు మనం కలిసి పని చేద్దాం అని ఒక మాట చెబుతూ.. చిరంజీవి బోయపాటికి కాల్ చేశారట. ఇకపోతే చిరంజీవి ఇప్పటి వయసుకు ఇమేజ్ కు తగ్గ రెండు కథలు రెడీ చేసి పెట్టాడట బోయపాటి. అందులో చిరు కు నచ్చిన కథను డెవలప్మెంట్ చేయిస్తాడని టాక్. మొత్తానికి ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న ఉదయం ఎదురు నడిచి వచ్చినట్లు ఉంది బోయపాటి పరిస్థితి.

చిరు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భారీ సినిమా కాబట్టి ఎలా కాదు అనుకున్న 10-12 నెలలు పడుతుంది. శ్రీనుకు ఇప్పటికే బాలకృష్ణ, అఖిల్ అక్కినేని ఆఫర్ ఇచ్చి ఉన్నారట. చిరు కోసం పక్కా ప్లాన్ సిద్దం చేస్తాడా లేక ఇతర హీరోలతో ఏమైనా సినిమా కమిట్ అవుతాడా అనేది చూడాలి. ఏదైనా గొప్ప చిక్కు వచ్చిపడింది శ్రీనుకు. బోయపాటి శ్రీను ఇప్పుడు ‘జయ జానకి నాయక’ సినిమా పనులుతో బిజీగా ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News