కొత్త అవతారం కలిసొచ్చేనా?

Update: 2017-02-20 12:59 GMT
టాలీవుడ్ బ్యూటీ ఛార్మీ కౌర్ దాదాపు 15 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించింది. అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకున్న జ్యోతి లక్ష్మి బాక్సాఫీస్ దగ్గర పేలిపోయాక మళ్లీ హీరోయిన్ గా కూడా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. అయితే.. ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ.. కొత్త అవతారాలు ఎత్తుతోంది.

జ్యోతి లక్ష్మి చిత్రంతోనే ప్రొడక్షన్ లో కూడా భాగం అయిన ఛార్మీ.. ఆ తర్వాత పూరీ కనెక్ట్స్ అంటూ.. ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్ అందించే సెగ్మెంట్ ను డీల్ చేస్తోంది. ఇప్పుడు రోగ్ మూవీకి పూర్తిగా పబ్లిసిటీ వ్యవహారాలు అన్నీ ఛార్మీ చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఇప్పటికే తన పీఆర్ టీం.. ఛార్మీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసిందట. రోజూ కనీసం రెండు సార్లు.. పూరీ తీస్తున్న రోగ్ మూవీ హెడ్ లైన్స్ లో కనపడాలని చెప్పిందట ఛార్మీ.

తన పర్సనల్ కెరీర్ లో ఎప్పుడూ టాప్ రేంజ్ లోకి చేరలేకపోయినా.. ఇప్పుడు ఇన్ని రంగాల్లో ఇంత అనుభవం సంపాదించాక.. వాటిని అన్నిటినీ రంగరించి పబ్లిసిటీ కేంపెయిన్ ని హ్యాండిల్ చేసే విభాగాన్ని దృష్టి పెడుతోంది. మరి ఇందులో అయినా ఛార్మీ సక్సెస్ అవుతుందో లేదో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News