విశ్వంభర చిరంజీవి ఒక్కడేనా..?

భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో మెగాస్టార్ చిరంజీవి ఇక మీదట అసలు రీమేక్ ల జోలికి వెళ్లకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు

Update: 2024-04-30 03:37 GMT

భోళా శంకర్ ఇచ్చిన షాక్ తో మెగాస్టార్ చిరంజీవి ఇక మీదట అసలు రీమేక్ ల జోలికి వెళ్లకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. తన ఫ్యామిలీకు సన్నిహితుడైన మెహర్ రమేష్ కి ఏదో మేలు చేద్దాం అనే ఆలోచనతోనే ఆ సినిమా చేశాడా ఏంటని మెగా ఫ్యాన్స్ అంతా అనుకునారు. సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా జరిగిన తర్వాత దాని గురించి ఎంత అనుకున్నా టైం వేస్ట్ పనే అవుతుంది. అందుకే బింబిసార సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన వశిష్టతో మెగా మూవీ ఫిక్స్ చేసుకున్నాడు చిరు.

విశ్వంభర అంటూ ఒక గొప్ప కథతో రాబోతున్నారని తెలుస్తుంది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నాడని వినిపించిన కామెంట్స్ అన్నిటికీ ఈ సినిమాతో సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యారు. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 200 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

Read more!

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పి కేవలం ఒక్క చిరంజీవి ఉంటేనే సరిపోతుందా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. సరైన కంటెంట్ ఉంటే చిరు ఒక్కడైనా సరిపోద్ది కానీ నేషనల్ లెవెల్ రిలీజ్ చేసే ప్రతి సినిమాలో ఇతర భాష నటీనటులను తీసుకుంటారు. అక్కడ పరిచయం ఉన్న నటులైతే ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని దర్శక నిర్మాతల ఆలోచన.

చిరు విశ్వంభర సినిమాలో కేవలం చిరంజీవి గురించి తప్ప మిగతా స్టార్ కాస్ట్ గురించి ఏ న్యూస్ బయటకు రాలేదు. హీరోయిన్స్ గా అయితే త్రిషతో పాటు మీనాక్షి, ఆషిక రంగనాథ్ ఇంకా మరో ఇద్దరి పేర్లు వినిపించాయి. త్రిష, మీనాక్షి తప్ప మిగతా వారంతా కూడా చిరంజీవికి సిస్టర్ రోల్స్ లో కనిపిస్తారని టాక్. పాన్ ఇండియా సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన విశ్వంభరలో వేరే భాషల నటుల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

సినిమా కోసం 17 దాకా భారీ సెట్లు వేస్తున్నట్టు తెలుస్తుండగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే సంథింగ్ స్పెషల్ గా ఈ మూవీ ఉండేలా వశిష్ట తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News