కళాతపస్వితో కలిసి నటించిన చరణ్!

Update: 2021-09-25 09:30 GMT
తెలుగు తెర నుంచి జాలువారిన ఆణిముత్యాల వంటి సినిమాలను అందించిన దర్శకుల జాబితాలో బాపు - కె. విశ్వనాథ్ కనిపిస్తారు. బాపు విషయానికి వస్తే, రామాయణ .. మహాభారతంలోని ఘట్టాలను సాంఘిక చిత్రాలకి తగిన కథలుగా మలిచి అందించిన తీరు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సరదా సరదాగా సాగిపోయే ఆ కథలు బలమైన సందేశాన్ని కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక కె.విశ్వనాథ్ విషయానికి వస్తే, సంగీతం .. నాట్యం అనేవి ఆయన కథల్లో పెనవేసుకుపోయి కనిపిస్తాయి. అలా ఎన్నో చిత్రరాజాలను అందించిన ఆయన, నటుడిగాను తన ప్రత్యేకతను చాటుకున్నారు.

కె. విశ్వనాథ్ నటుడిగా కూడా ఒక స్థాయికి తగిన పాత్రలనే పోషించారు. ఆయన రూపం .. ఆయన వాయిస్ .. ఆయనలోని తెలుగుదనం పాత్రలకు నిండుదనాన్ని తీసుకొచ్చేవి. ఒక వైపున సినిమాలతో పాటు మరో వైపున వాణిజ్య ప్రకటనలలోను ఆయన నటించారు. అలా ఆయన చేసిన వాణిజ్య ప్రకటనలలో అందరికీ బాగా గుర్తుండిపోయిన యాడ్ .. 'సువర్ణభూమి'. 'తరతరాలకు చెరగని చిరునామా' అంటూ ఆయన ఆ యాడ్ లో కళకళలాడిపోయేవారు. అయితే ఇప్పుడు ఆయన వయసు సహకరించని పరిస్థితి.

అందువలన 'సువర్ణభూమి'వారు కొత్తగా చేసిన యాడ్ లో కె.విశ్వనాథ్ గారిని అలా ఒక ఫ్రేమ్ లో చూపిస్తూ, డైలాగ్ వెర్షన్ ను చరణ్ తో చెప్పించారు. "లైఫ్ లో ఎవరైనా సరే ఫిట్ గా ఉండాలి .. ఫైనాన్షియల్ ఫిట్ నెస్ కూడా ఉండాలి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది పెరిగేలా ఉండాలి. ఒకటి మాత్రం నిజం .. సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసినవారు మాత్రమే త్వరగా అభివృద్ధి చెందారు. దానికి పెద్దవాళ్ల ఆశీస్సులు ఉంటే సక్సెస్ మనదే .. సువర్ణభూమి .. తరతరాలకు చెరగని చిరునామా" అంటూ చరణ్ .. విశ్వనాథ్ పాదాలను తాకి ఆశీస్సులు అందుకున్నారు. ఈ యాడ్ కోసం చరణ్ కి భారీ పారితోషికం ముట్టిందట. విశ్వనాథ్ తో కలిసి నటించే అవకాశం రావడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు.       



Full View





Tags:    

Similar News