ఇప్పటికైనా ఆ దర్శకుడి కల తీరుతుందా..!

Update: 2020-04-04 03:30 GMT
కరోనా వైరస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని హై రేంజ్ లో దెబ్బతీసింది. లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం మాటను ఖాతరు చేస్తూ సినీ దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్ నిలిపేశారు. అలా షూటింగ్ నిలుపుకొని ఇంట్లో ఉన్నవారిలో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. ముంబైలో తన ఫైటర్ యొక్క ప్రధాన షెడ్యూల్ పూర్తి చేసి, లాక్ డౌన్ విధించే సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు. లాక్ డౌన్ తర్వాత ఫైటర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేస్తామని తెలిపారు. పూరీ జగన్నాథ్ తెలివిగా లాక్ డౌన్ టైంని ఫుల్ గా వినియోగించుకుంటున్నాడట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటం తో తదుపరి సినిమాకోసం స్క్రిప్ట్ రాస్తున్నాడట. అయితే దానికి హీరో ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో పూరీ స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ రాయబోతున్న స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవి కోసమేనని ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. గతంలో పూరీ జగన్నాథ్ 'ఆటో జానీ' సినిమాని చిరంజీవి 150 వ చిత్రంగా చేయాల్సి ఉంది. అధికారిక ప్రకటన తర్వాత స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాలేదని ఆపేసారు. రిస్క్ లేకుండా ఒక రీమేక్ సినిమా చేసేసి 100 కోట్ల క్లబ్ లో చేరారు మెగాస్టార్.

అయితే నీతో తప్పకుండా సినిమా చేస్తానని చిరంజీవి అప్పట్లోనే మాటిచ్చారట. ఆ మాట కోసం ఇపుడు పూరీ జగన్నాథ్ ఎదురుచూస్తున్నాడు. అదృష్టం కొద్ది ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు పూరిజగన్నాథ్. ఈ సందర్భంగా మెగాస్టార్ నుండి ఇపుడు పూరికి పిలుపొచ్చి ఉంటుందని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి మెగాస్టార్ అయితే అవకాశం ఇచ్చేశాడు అన్నట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత పూరీ సినిమా పట్టాలెక్కుతుందేమో అని పూరీ అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    

Similar News