పెద్ద నిర్మాతకు చిన్న చెక్ ఇచ్చాడు

Update: 2016-10-24 04:18 GMT
ఏ దిల్ హై ముష్కిల్.. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ మూవీ.. ఎట్టకేలకు వివాదాలన్నిటినీ అధిగమించింది. రణబీర్ కపూర్- ఐశ్వర్యారాయ్- అనుష్క శర్మలు నటించిన ఈ మూవీలో పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించడంపై.. దర్శక నిర్మాత కరణ్ జోహార్ చాలానే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇకపై తన సినిమాలో పాక్ నటులు ఉండరంటూ ఓ వీడియో మెసేజ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

ఇదంతా గమనించిన ఈ అభిమానికి.. బోలెడంత బాధ కలగడంతో పాటు.. కరణ్ జోహార్ పై జాలి కూడా కలిగింది. అందుకే తను సినిమా చూడబోనంటూ ఓ 320 రూపాయలకు చెక్ పంపించాడు. ''పాక్ యాక్టర్ ఉన్నాడనే రీజన్ తో మీ సినిమాను ఎంఎన్ ఎస్ బ్యాన్ చేస్తామని చెప్పింది. ఇకపై పాకిస్తానీ నటులతో వర్క్ చేయనంటూ మీరు చాలా ఫీలయ్యి చెప్పాల్సి వచ్చింది. మీ బాధ చూసి నేను కూడా చాలా బాధ పడ్డాను. నేను మీ సినిమా చూడడం లేదు. నేను కూడా ఓ వ్యాపారవేత్తను కాబట్టి.. ఆ నష్టం ఏంటో నాకు తెలుసు. అందుకే టికెట్ల రేట్ల మేరకు డబ్బులు పంపుతున్నా'' అంటూ లెటర్ రాసి మరీ 320 రూపాయలను చెక్ రూపంలో పంపాడు మహరాష్ట్ర అకోలా ఏరియాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్.

అక్కడ టికెట్ రేటు 160.. సో రెండు టికెట్లకు 320 ఇచ్చేశాడన్న మాట. నిర్మాతకు నేరుగా ఓ వ్యూయర్ చెక్ పంపడం హాట్ టాపిక్ కాగా.. ఈ లెటర్.. రూ. 320 చెక్.. ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News