ట్రైలర్ టాక్: సస్పెన్స్ పెంచుతున్న అశ్వథ్థామ

Update: 2020-01-23 13:04 GMT
నాగశౌర్య.. మెహ్రీన్ లు హీరో హీరోయిన్లుగా నూత దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన చిత్రం 'అశ్వథ్థామ'.  జనవరి 31 న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్.. టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

"రాక్షసుడిని.. భగవంతుడిని చూసిన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి" అంటూ విలన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఈలెక్కన ఆ విలన్ ను చూసిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడన్న మాట.  ట్రైలర్ లో చూపించిన ముక్కలన్నీ కలుపుకుంటే.. వైజాగ్ లో అమ్మాయిలను ఎవరో ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటారు. అయితే ఈ హత్యలు సంబంధం లేనట్టు కనిపిస్తాయి కానీ వాటి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది.  అనుకోని పరిస్థితుల్లో నాగశౌర్య ఈ హత్యల గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలు పెడతాడు. అయితే ఆ మార్గంలో అనుకోని ఇబ్బందులు.. ఒక్క లింక్ కూడా దొరకదు. పైగా  తనను చంపేందుకు విలన్ గ్యాంగుకు సంబంధించిన కొందరు జాలరులు ప్రయత్నిస్తూ ఉంటారు.  ఈ పరిస్థితుల్లో ఎలా విలన్ ను కనుక్కున్నాడు. ఏం చేశాడు అన్నది కథ.

ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది.  యాక్షన్ సీన్లను ఈ ట్రైలర్ లో హైలైట్ గా చెప్పుకోవచ్చు.  శౌర్య మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్నాడు. నేపథ్య సంగీతం.. సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగిస్తోంది.  ఆలస్యం ఎందుకు.. ఈ 'అశ్వథ్థామ' ను చూసేయండి.

Full View
Tags:    

Similar News