చరణ్ సినిమాలో విలన్ ఎవరంటే..

Update: 2015-10-12 09:44 GMT
ఇక రూమర్లకు తెర దించేయవచ్చు. రానా దగ్గుబాటి - నారా రోహిత్ - మాధవన్.. వీళ్లందరూ పక్కకెళ్లిపోయారు. చరణ్ విలన్ అరవింద్ స్వామే. ఇది ‘తనీ ఒరువన్’ రీమేక్ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఒరిజినల్ లో సిద్ధార్థ్ పాత్రను అద్భుతంగా పోషించి.. గొప్ప పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామినే తెలుగు వెర్షన్ కి కూడా విలన్ గా కన్ఫమ్ చేసింది సురేందర్ రెడ్డి టీమ్.

నిజానికి ‘తనీ ఒరువన్’ తమిళ రీమేక్ అనుకున్నపుడు అరవింద్ తోనే తెలుగులోనూ నటింపజేయాలని అనుకున్నారు. కానీ అతను రీమేక్ చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడం.. ఇంకెవరైనా కొత్తగా ట్రై చేస్తే బావుంటుందని అనిపించడంతో వెతుకులాట ప్రారంభించారు. రానా - రోహిత్ - మాధవన్ ల పేర్లు వినిపించాయి. ఐతే అవతలి వాళ్లు ఒప్పుకోలేదా.. వీళ్లే శాటిస్ఫై అవ్వలేదా.. అన్నది తెలియదు కానీ.. ఆ ముగ్గురిలో ఎవ్వరూ కన్ఫమ్ కాలేదు.

సిద్ధార్థ్ పాత్రకు అరవింద్ తప్ప వేరెవ్వరూ న్యాయం చేయలేరని భావించి చివరికి అతణ్నే ఫిక్స్ చేశారు. ఈ విషయమే చెప్పి గట్టిగా అడగడంతో అరవింద్ కూడా ఒప్పేసుకున్నాడట. అతడికి భారీ పారితోషకం కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. సమాజంలో గొప్పవాడిగా చలామణి అవుతూ పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న ఓ సైంటిస్టు పాత్రను పోషించాడు అరవింద్. తెరవెనుక దారుణాలు చేసే కన్నింగ్ విలన్ గా అతడి పాత్ర సినిమాకు హైలైట్ అయింది. అరవింద్ గెటప్ - అతడి స్టయిల్ - స్క్రీన్ ప్రెజెన్స్ - నటన ఆ పాత్ర అద్భుతంగా పండటానికి కారణమయ్యాయి. ఇప్పుడు తెలుగులోనూ మరోసారి ఆ పాత్రను పండించడానికి రెడీ అవుతున్నాడు అరవింద్.
Tags:    

Similar News