అపరిచితుడు రీమేక్ వివాదం! చినికి చినికి గాలి వానలా!!
ఒక ఘటన దానికి కౌంటర్ ఘటన అనుసరణగా సీక్వెన్స్ ఘటన ఇవన్నీ పరిశ్రమలో నిత్యం చూసేవే. అపరిచితుడు హిందీ రీమేక్ ని ప్రకటించగానే.. దర్శకుడు శంకర్ కి ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కి మధ్య వివాదం తలెత్తింది. ఇది చినికి చినికి గాలి వాన అవుతున్నట్టే ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో అపరిచితుడు (అన్నియన్-2005)ని రీమేక్ చేస్తున్నానని ఇటీవల శంకర్ అధికారికంగా ప్రకటించారు. అలా ప్రకటించిన రోజు నుంచీ వివాదాస్పదమైంది.
అన్నీయన్ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ ఈ చిత్రం హక్కులను కలిగి ఉన్నారని రీమేక్ చేయడానికి లేదా స్వీకరించడానికి శంకర్ కు అనుమతి లేదని ఆరోపించారు. దానికి కౌంటర్ గా స్పందిస్తూ శంకర్ ఈ సినిమా మొత్తం కథ - స్క్రీన్ ప్లే తానే రాశానని అది తన ప్రొడక్ట్ అని అన్నారు. కాబట్టి అతను ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు రవిచంద్రన్ ఒక అడుగు ముందుకు వేసి దర్శకుడిపై సౌతిండియా చాంబర్ లో ఫిర్యాదు చేశారు.
సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (సిఐసిసి) ఫిర్యాదును స్వీకరించింది. ప్రస్తుతం సినీపెద్దలు విచారణ కోసం సిద్ధమవుతున్నారు. SICC చైర్మన్ రవి కొట్టారకర ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలకు సంబంధించి ఎస్.ఐసిసి శంకర్ కు ఒక లేఖ రాసింది. ఏదైనా చర్య తీసుకునే ముందు వారు దర్శకుడి సమాధానం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక ప్రతిష్ఠాత్మక సినిమా చేసేప్పుడు శంకర్ వివాదాల్ని పరిష్కరించుకుని ముందుకు వెలితే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో తొలి నుంచి వివాదాలు ఉండడం వల్లనే కొంత సినిమా తీశాక భారతీయుడు 2 (ఇండియన్ 2) ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ హౌస్ తో పరిష్కారం లభించకపోవడంతో శంకర్ అలిగారని కోర్టుల పరిధిలో దీనిని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారమవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో అపరిచితుడు (అన్నియన్-2005)ని రీమేక్ చేస్తున్నానని ఇటీవల శంకర్ అధికారికంగా ప్రకటించారు. అలా ప్రకటించిన రోజు నుంచీ వివాదాస్పదమైంది.
అన్నీయన్ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ ఈ చిత్రం హక్కులను కలిగి ఉన్నారని రీమేక్ చేయడానికి లేదా స్వీకరించడానికి శంకర్ కు అనుమతి లేదని ఆరోపించారు. దానికి కౌంటర్ గా స్పందిస్తూ శంకర్ ఈ సినిమా మొత్తం కథ - స్క్రీన్ ప్లే తానే రాశానని అది తన ప్రొడక్ట్ అని అన్నారు. కాబట్టి అతను ఎవరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు రవిచంద్రన్ ఒక అడుగు ముందుకు వేసి దర్శకుడిపై సౌతిండియా చాంబర్ లో ఫిర్యాదు చేశారు.
సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (సిఐసిసి) ఫిర్యాదును స్వీకరించింది. ప్రస్తుతం సినీపెద్దలు విచారణ కోసం సిద్ధమవుతున్నారు. SICC చైర్మన్ రవి కొట్టారకర ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలకు సంబంధించి ఎస్.ఐసిసి శంకర్ కు ఒక లేఖ రాసింది. ఏదైనా చర్య తీసుకునే ముందు వారు దర్శకుడి సమాధానం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక ప్రతిష్ఠాత్మక సినిమా చేసేప్పుడు శంకర్ వివాదాల్ని పరిష్కరించుకుని ముందుకు వెలితే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో తొలి నుంచి వివాదాలు ఉండడం వల్లనే కొంత సినిమా తీశాక భారతీయుడు 2 (ఇండియన్ 2) ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ హౌస్ తో పరిష్కారం లభించకపోవడంతో శంకర్ అలిగారని కోర్టుల పరిధిలో దీనిని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రచారమవుతోంది.