స్టార్ హీరోయిన్ ఎఫ్.బి.ఐ.ను కలిసింది!!

Update: 2016-10-27 22:30 GMT
అబ్బే దానిదేముంది.. మొన్న మన సెక్సీ బ్యూటి ప్రియాంక చోప్రా క్వాంటికో టివి సీరియల్ లో ఎఫ్.బి.ఐ ఏజెంటుగా నటించిందిగా.. అందుకే ఆమె ఇప్పుడు స్వయంగా వారిని కలసి తన టివి షో చూడమని డివిడి చేతిలోపెట్టి ఉంటుందా? అంత సీన్ లేదండోయ్. ఇక్కడ ఎఫ్.బి.ఐ.ను కలిసింది హాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలి. పదండి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

సెప్టెంబర్ 14న బాగా తాగేసి.. ఆ మత్తులో మొగుడు బ్రాడ్ పిట్ తన కుమారుడు మాడ్ డాక్స్(15)ను తిట్టడమే కాకుండా కొట్టాడని ఆరోపణలు చేసింది ఏంజెలినా జోలి. తన విడాకులు నోటీస్ డాక్యుమెంట్లు అమ్మడు ఈ విషయాలను చెప్పింది. అంతేకాకుండా. మనోడు విమానంలో వస్తూ ఎయిర్ హోస్టెస్ లతో రొమాన్స్ చేస్తున్నాడని కూడా టాక్ వచ్చింది. ఈ యవ్వారంలో నిజానిజాలను తేల్చడానికి ఏకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (మన సిబిఐ టైపు) వారు రంగంలోకి దిగారు. నిన్న ఏంజెలినా జోలిని ఈ విషయంపై వారు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. అది సంగతి.

ఇప్పటికే తాము విడిపోతున్నాం అంటూ ప్రకటించేసిన ఆ హాలీవుడ్ హాట్ షాట్ కపుల్.. ఇప్పుడు ఇలా ఎఫ్.బి.ఐ వరకు రచ్చ అవుతుందని ఊహించనేలేదు. ఒక్కోసారి అంతే గురూ.. హై ప్రొఫైల్ సెలబ్రిటీలు ఎటువంటి ఆరోపణలను చేసినా కూడా.. ప్రభుత్వాలు యంత్రాంగాలూ వాటిని సీరియస్ గా తీసుకుంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News