మోహన్ బాబుతో అనసూయ

Update: 2017-07-23 09:38 GMT
ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసి.. ఏకంగా 500 సినిమాల మైలురాయిని అందుకున్న నటుడు మంచు మోహన్ బాబు. ఐతే కొడుకులు రంగంలోకి దిగాక ఆయన జోరు తగ్గించేశారు. ఆయన తెరమీద కనిపించడం అరుదైపోయింది. చివరగా ‘రౌడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ బాబు.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ‘పెళ్లైన కొత్తలో’ దర్శకుడు మదన్ దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రంలో మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు కానీ.. ఓ కీలకమైన పాత్రకు యాంకర్ అనసూయను తీసుకున్నట్లు సమాచారం.

‘క్షణం’ తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న అనసూయ.. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’లో అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు మోహన్ బాబు లాంటి విలక్షణ నటుడితో సినిమా చేసే ఛాన్స్ పట్టేసింది. తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నట్లుగా అనసూయ చెప్పింది. ఓవైపు ‘అమెరికా ఆచారి యాత్ర’ సినిమా చేస్తూనే మరోవైపు తండ్రితో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు విష్ణు. ఇంతకుముందు విష్ణు-మోహన్ బాబు కాంబినేషన్లో ‘గేమ్’.. ‘రౌడీ’ లాంటి సినిమాలు వచ్చాయి. మోహన్ బాబు తమిళంలో ధనుష్ దర్శకత్వంలో రూపొందిన ‘పవర్ పాండి’ రీమేక్  లోనూ నటించే అవకాశాలున్నట్లు సమాచారం.
Tags:    

Similar News