రంగస్థలానికి చేరుకున్న హాట్ యాంకర్

Update: 2017-06-25 08:01 GMT
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే ఈ మూవీకి ఇండస్ట్రీలో విపరీతమైన బజ్ నెలకొంది. ముందుగా అనుకున్న దసరా.. దీపావళి రిలీజ్ లు సాధ్యమవుతాయో లేదో తెలీదు కానీ.. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం షాక్ ఇచ్చేస్తోంది.

మరోవైపు ప్రధాన పాత్రధారులు అందరినీ రంగస్థలం షూటింగ్ లో భాగం చేసేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా.. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. హాట్ యాంకర్ అనసూయకు ఓ కీలక పాత్ర ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా గురించి అనసూయ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. తాను రంగస్థలం షూటింగ్ స్పాట్ కు చేరుకున్నానంటూ.. అక్కడి వెల్ కం బోర్డును ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది అనసూయ. 'రంగస్థలం 1985.. గ్రామానికి విచ్చేయుచున్న చిత్ర యూనిట్ కి స్వాగతం.. సుస్వాగతం' అంటూ రాసి ఉన్న బోర్డ్ ను పోస్ట్ చేసిన అనసూయ... ఇక్కడకు తాను చేరుకున్నట్లు చెప్పడమే కాదు.. ఆన్ బోర్డ్ అని కూడా రాసుకొచ్చింది.

ఇక సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చెర్రీ మూవీ రంగ స్థలం 1985పై అప్పుడే విపరీతమైన బజ్ ఏర్పడుతోంది. శాటిలైట్ రైట్స్ కు 16 కోట్లు.. డిజిటల్ రైట్స్ కు 13 కోట్లు గిట్టాయంటే.. రంగస్థలంపై మార్కెట్ లో ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. సంక్రాంతి 2018న సినిమా రిలీజ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News