'ఎవడు' గాళ్.. అస్సలు హ్యాపీగా లేదు

Update: 2016-06-01 01:30 GMT
బికినీల్లో ఆరితేరిన బ్యూటి ఆమీ జాక్సన్. అమ్మడు తెలుగులో 'ఎవడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. గ్లామర్‌ లవ్వర్లను ఆనందపరిచింది. ఆ తరువాత 'ఐ' సినిమాల తన అందాల విందుతోనే కాదు.. తన యాక్టింగ్‌ తో కూడా మతిపోగొట్టుంది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'రోబో 2.0' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే అమ్మడు ఎందుకు హ్యాపీ లేదు అనే విషయానికి వస్తే.. ఈ మధ్యనే అమ్మడు తొలిసారిగా కేన్స్ చలనచిత్రోత్సవం కు వెళ్లింది. అయితే భారతీయ సినిమాల తరుపునుండి కాని.. ఇక్కడి బ్రాండ్స్ తరుపున కాని అక్కడకు వెళ్ళలేదు. కేవలం బ్రిటీష్‌ చలన చిత్ర రంగం తరుపునుండి అక్కడకు వెళ్లింది. అలాంటప్పుడు ఆమెకు ఇండియా బీభత్సమైన కవరేజ్ ఎలా వస్తుంది? కాకపోతే చాలా ట్రెండీగా ఫ్యాషన్‌ దుస్తులు ధరించడం కారణంగా.. అమ్మడు ఇండియాలో తన పోటోలు ఒక సూపర్ క్రేజ్ క్రియేట్‌ చేస్తాయి అనుకుందట. కాని అలా జరుగలేదు. అందుకే అస్సలు హ్యాపీగా లేదీ భామ.

అయినా విడ్డూరం కాకపోతే.. ఇండియా తరుపునుండి వెళ్ళకుండా.. అసలు ఇంతవరకు హాలీవుడ్‌ కాని బ్రిటీష్‌ సినిమాలో కాని ఒక్క సినిమా కూడా చేయని అమ్మడు.. వారి సినిమా తరుపునుండి అక్కడకు వెళ్లడం ఏంటండీ? పైగా వెళితే వెళ్లింది.. భారతీయ పి.ఆర్‌. ఏజెన్సీ లతో ఆ విషయాన్ని ప్రమోట్‌ చేయించుకోవాలి  కాని.. ఆటోమ్యాటిక్‌ గా ప్రమోట్‌ చేస్తారు అనుకోవడం ఏంటి? గ్రో అప్ ఆమీ!!
Tags:    

Similar News