భార్యను దూరం పెట్టేసిన మెగాస్టార్?

Update: 2017-01-24 06:20 GMT
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక దుమారం చెలరేగుతూనే ఉంటుంది. ఆయా రూమర్లకు.. తమ ప్రవర్తనతోనే ఫుల్ స్టాప్ పెడుతుంటారు తప్ప.. వీటిపై అంతగా స్పందించదు బచ్చన్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడు అమితాబ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

'ప్రస్తుతం అమితాబ్ బచ్చన్.. జయా బచ్చన్ ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. వారు విడివిడిగా ఉంటాన్నారు. ఒకరు ప్రతీక్షలో.. మరొకరు జానక్ లో నివాసం ఉంటున్నారు. జయ-ఐశ్వర్యల మధ్య కూడా విబేధాలు ఉన్నా వాటికి నాకు సంబంధం లేదు' అంటూ కామెంట్ చేశారు అమర్ సింగ్. నిజానికి బచ్చన్ ఫ్యామిలీకి అమర్ సింగ్ చాలా క్లోజ్. ఆయన కారణంగానే సమాజ్ వాదీ పార్టీలో చేరారు జయ. అలాంటిది అమర్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే సందేహాలు వినిపిస్తున్నాయి. స్వయంగా తనే విబేధాలున్నాయంటూ కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రీసెంట్ గా జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ఫంక్షన్ లో.. జయాబచ్చన్-ఐశ్వర్యా రాయ్ లు ఎంత సన్నిహితంగా మెలిగారో అందరూ చూశారు. వేదికపై అవార్డు ఐశ్వర్య అవార్డు అందుకుంటున్న సమయంలో కూడా అమితాబ్ తో అభిషేక్-ఐశ్వర్యలు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అమర్ సింగ్.. అమితాబ్-జయలు విడివిడిగా ఉంటున్నారని వ్యాఖ్యలు చేయడం ఏంటా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News