తనకు చిరంజీవి ఓకే చెబుతాడంటున్న బడానిర్మాత!

Update: 2015-05-25 11:30 GMT
తను మంచి కథతో వెళితే చాలు.. చిరంజీవితో సహా అనేక మంది హీరోలు ఓకే చెబుతారని.. సినిమా చేయడానికి ముందుకొస్తారని అంటున్నాడు ఏఎం రత్నం. ఇటీవలే 'ఎంతవాడుగానీ..' సినిమాను తమిళం నుంచి డబ్‌ చేసి విడుదల చేసిన రత్నం ఈ ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి వివరిస్తూ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చాడు రత్నం.

    తను మంచి కథతో వెళితే మెగాస్టార్‌ ఓకే చెబుతాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడీయన. చిరంజీవి మాత్రమే కాదు.. ఇతర టాప్‌హీరోలు కూడా స్పందిస్తారని అన్నాడు. ఒకప్పుడు రత్నం భారీ సినిమాలు రూపొందించాడు.

    దక్షిణాదిలో టాప్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకొన్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని ప్లాఫ్‌లు ఈ నిర్మాతను ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడిప్పుడే ఈయన కోలుకొంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తిరిగి పెద్దహీరోలతోనూ... భారీ చిత్రాలను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రత్నం ప్రకటించుకొన్నాడు.

    భారతీయుడికి కొనసాగింపుగా సీక్వెల్‌ సినిమాను తీసే ఆలోచన కూడా ఉందని.. ఈ విషయం గురించి శంకర్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా కూడా రత్నం చెప్పడం విశేషం. 

Tags:    

Similar News