క్రేజీ కాంబినేష‌న్ కు ప్రిన్స్ గ్రీన్ సిగ్న‌ల్!

Update: 2018-08-11 06:49 GMT
టాలీవుడ్ తీరు మారుతోంది. గ‌తానికి భిన్నంగా ఇప్పుడు డిఫ‌రెంట్ మూవీస్ కు ప్లానింగ్ జ‌రుగుతోంది. క్రేజీ కాంబినేష‌న్లు ఓకే కావాలే కానీ.. వంద‌ల కోట్ల కుమ్మ‌రించేందుకు సైతం నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. మార్కెట్ విస్తృతి కావ‌టం.. సినిమా అదిరిపోయేలా ఉండాలే కానీ.. దాంతో ఎలా సొమ్ము చేసుకోవాలో  టాలీవుడ్‌ కి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నేర్పించ‌టంతో ఇప్పుడు ఆ బాట‌లో న‌డిచేందుకు రెఢీ అయిపోతున్నారు అగ్ర నిర్మాత‌లు.

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు సిల్వ‌ర్ జూబ్లీ మూవీ అయిన మ‌హ‌ర్షి కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

ఈ మూవీ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే సినిమాకు మ‌హేశ్ ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మ‌హేశ్ 27వ సినిమా ఎవ‌రిద‌న్న దానిపై ప‌లు వార్త‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఇందులో ప్ర‌ధానంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో సినిమాకు ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ తో కాద‌ని.. టాప్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో సినిమా అన్న‌మాట వినిపిస్తోంది. అయితే.. ఈ రెండు వార్త‌లు ఎంత మాత్రం నిజం కాద‌ని.. అస‌లు విష‌యం వేరుగా ఉంద‌ని చెబుతున్నారు.

తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం మహేశ్ 27వ సినిమా అల్లుఅర‌వింద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతున్నారు. ఈ సినిమాకు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తార‌ని చెబుతున్నారు. దీనికి మ‌హేశ్ కూడా ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఒక‌వేళ ఈ న్యూస్ నిజ‌మైతే.. ఈ సినిమా సంచ‌ల‌నంగా మారుతుంద‌ని చెబుతున్నారు.  ఇప్ప‌టివ‌ర‌కూ మెగా హీరోల‌తో కాకుండా.. మ‌రే స్టార్ హీరోతో పెద్ద సినిమా తీయ‌ని అల్లు అర‌వింద్ త‌న స్టైల్ కు భిన్నంగా ప్రిన్స్ తో మూవీకి ఓకే చెప్ప‌టం అంటే.. మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసిన‌ట్లేన‌ని చెప్ప‌క‌తప్ప‌దు. మ‌రి.. ఈ న్యూస్ అధికారికంగా ఎప్పుడు ప్ర‌క‌టిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News