అప్పుడే ఆట మొదలెట్టేసిన ఖిలాడీ

Update: 2017-02-23 07:30 GMT
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.. ఇప్పుడు నిజంగానే ఖిలాడీ అవతారం అవతారం ఎత్తబోతున్నాడు. తాజాగా విడుదలైన జాలీ ఎల్ ఎల్బీ మూవీ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేయడంతో.. అక్షయ్ జోరు మరింతగా పెరిగిపోయింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుండగానే.. తన నెక్ట్స్ మూవీ ప్రిపరేషన్స్ లో పడిపోయాడు అక్షయ్.

స్వతంత్రం వచ్చాక ఒలిపింక్ క్రీడల్లో దేశానికి తొలిసారి పతకం అందించిపెట్టే పాత్రను చేసేందుకు అక్షయ్ కుమార్ సై అన్నాడు. 1948.. 1952.. 1956 ఒలింపింక్స్ లో భారతీయ పురుషుల హాకీ జట్టు బంగారుపతకం సాధించగా.. ఈ విజయాల్లో కీలకపాత్ర పోషించిన బల్బీర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు ఖిలాడీ. హాకీ ప్లేయర్ గా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకునేందుకు ఇప్పటికే ఫుల్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాడట కూడా. ముంబై సబర్బన్ లోని ఓ స్కూల్ ఏరియాలో రోజూ కోచ్ సహాయంతో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.

సన్నీ కౌశల్ ఈ చిత్రంలో మరో ప్లేయర్ గా నటిస్తుండగా.. ఈయన కూడా తెగ సాధన చేసేస్తున్నాడు. 'గోల్డ్' టైటిల్ పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఈ ఖిలాడీ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. గేమ్ టైమ్ లో మినహాయిస్తే.. మిగతా మూవీ అంతా ధోతీ-కుర్తాలో కనిపించనున్నాడట అక్షయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News