మరీ ఇలా దిగజారుతావా.. విశాల్‌ పై వరలక్ష్మి ఫైర్‌

Update: 2019-06-14 09:56 GMT
కోలీవుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ వారికి కూడా విశాల్‌ మరియు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లు మంచి స్నేహితులు అని.. వారిద్దరిది గొప్ప స్నేహం అని తెలుసు. చిన్నప్పటి నుండి ఇద్దరు కూడా కలిసి పెరిగారు. చిన్నప్పటి నుండే స్నేహితులు అయిన వీరిద్దరు కలిసి నటించారు కూడా. వీరిద్దరి మద్య క్లోజ్‌ నెస్‌ చూసి అంతా కూడా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని కూడా అనుకున్నారు. వీరిద్దరి పెళ్లి అదుగో ఇదుగో అంటూ వార్తలు కూడా వచ్చాయి.

వరలక్ష్మి తండ్రి గతంలో శరత్‌ కుమార్‌ నడిగర్‌ సంఘంకు ప్రెసిడెంట్‌ గా చేశాడు. ఆయనపై విశాల్‌ పోటీ చేసి గెలిచిన సమయంలో కూడా ఇద్దరి మద్య స్నేహం చెక్కు చెదరలేదు. నడిగర్‌ సంఘం ఎన్నికల సమయంలో శరత్‌ కుమార్‌ పై విశాల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ తర్వాత కూడా విశాల్‌ తో వరలక్ష్మి నటించింది. కాని ఇప్పుడు వరలక్ష్మికి విశాల్‌ పై కోపం వచ్చింది. తన తండ్రిని పదే పదే టార్గెట్‌ చేస్తున్న కారణంగా విశాల్‌ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టింది.

ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో నడిగర్‌ సంఘం ఎన్నికల హడావుడి ఉన్న విషయం తెల్సిందే. మరోసారి ప్రెసిడెంట్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో విశాల్‌ ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టాడు. శరత్‌ కుమార్‌ వర్గం నుండి ఎవరు పోటీ చేసే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే శరత్‌ కుమార్‌ పై ఒక వీడియోను చేసి విశాల్‌ వదిలాడు. అందులో గతంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా శరత్‌ కుమార్‌ ఉన్న సమయంలో జరిగిన అక్రమాలను చూపించాడు విశాల్‌.

విశాల్‌ విడుదల చేసిన వీడియోపై వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడిగా నువ్వు గెలిచిన తర్వాత చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకోవాలి.. కాని ఇంకా కూడా పాత వారిపై విమర్శలు చేస్తూ గెలిచేందుకు ప్రయత్నించడం దిగజారుడు తనం అవుతుందని చెప్పుకొచ్చింది. ఇంత నీచానికి దిగజారుతావని తాను భావించలేదు అంటూ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి మద్య ఇన్నాళ్లుగా ఉన్న మంచి స్నేహం ఈ దెబ్బతో బ్రేకప్‌ అయినట్లే అంటూ అంతా భావిస్తున్నారు.
Tags:    

Similar News