వింబుల్డన్‌ ట్రోఫీకి అడుగు దూరంలో..సానియా

Update: 2015-07-10 16:57 GMT
సింగిల్స్‌లో సత్తా చూపించనప్పటికీ డబుల్స్‌తో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాదీ టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా డబుల్స్‌ విభాగంలో చెలరేగిపోతున్న సానియా.. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక ట్రోఫికి అడుగు దూరంలో ఉన్నారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్‌ ఓపెన్‌లో మహిళా డబుల్స్‌ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి మన సానియా మీర్జా ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఆమె అమెరికా జోడీపై అద్భుత విజయం సాధించారు. సెమీస్‌ మొత్తం ఏకపక్షంగా సాగటం చూసినప్పుడు.. సానియా మాంచి ఊపు మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. వింబుల్డన్‌ ట్రోఫికి అడుగుదూరంలో ఉన్న సానియా.. ఆ టైటిల్‌ను గెలుచుకుందామని ఆశిద్దాం.


Tags:    

Similar News