మరో వింబుల్డన్ టైటిల్ ను తెచ్చిన లియాండర్

Update: 2015-07-12 22:40 GMT
వింబుల్డన్ లో భారత్ ఆటగాళ్లు ఆడితే చూడాలని కోట్లాది భారతీయులు కలలు కన్న రోజులున్నాయి. ఇప్పుడు వింబుల్డన్ లో ఆడటమే కాదు.. టైటిల్ గెలుచుకునే సత్తాను సొంతం చేసుకున్నారు భారత్ ఆటగాళ్లు.

టెన్నిస్ సంచలనం.. హైదరాబాదీ అయిన సానియా మీర్జా వింబుల్డన్ మహిళల డబుల్స్ లో విజేతగా నిలిచిన నేపథ్యంలో యావత్ భారత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పలువురికి ఇప్పటికి తాము విన్నది నిజమేనా? అని అనుకునే పరిస్థితి. మన సానియా మీర్జా వింబుల్డన్ విజేతగా నిలిచిందన్న సంతోషం నుంచి ఇంకా బయటకు రాక ముందే.. భారత్ ఖాతాలో మరో వింబుల్డన్ టైటిల్ చేరింది.

తాజాగా జరిగిన వింబుల్డన్ మిక్సెడ్ డబుల్స్ లో భారత్ కు చెందిన స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్.. హింగిస్ ల జోడి విజయం సాధించారు. ఫైనల్ లో 6-1.. 6-1 తేడాతో ఆస్ట్రేలియన్ హంగారీయన్.. అలెగ్జాండర్ పేయా జోడిపై లియాండర్.. హింగిస్ జోడీ విజయం సాధించారు. దీంతో.. ఒకే ఏడాది రెండు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్న రికార్డును సొంతం చేసుకోవటంతో పాటు.. భారతీయులకు ఊహించని విధంగా డబుల్ థమాకా ఇచ్చి ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పకతప్పదు.
Tags:    

Similar News