బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఘోర అవమానం జరిగింది. ఓ బహిరంగసభలో పాల్గొని విమానం ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. చెప్పు సీఎం నితీశ్కు కొంత దూరంలో పడింది. నితీశ్కుమార్ వరసగా నితీశ్కుమార్ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనను చాలాసార్లు నిరసన కారులు అడ్డుకున్నారు.
నితీశ్కూడా సహనం కోల్పోయి ఆందోళన కారులపై సీరియస్ అవుతున్నారు. తనకు ఓటు వేయకపోయినా బాధపడనని, కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని ఆయన అంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో కొందరు లాలూ ప్రసాద్ యాదవ్ కి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో నితీష్ కుమార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటీ నాన్సెన్స్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఓ సీఎం పైనే చెప్పులు విసరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షనేతలు కుట్రపూరితంగా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆర్జేడీ నాయకులు ఆరోపిస్తున్నారు.
నితీశ్కూడా సహనం కోల్పోయి ఆందోళన కారులపై సీరియస్ అవుతున్నారు. తనకు ఓటు వేయకపోయినా బాధపడనని, కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని ఆయన అంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో కొందరు లాలూ ప్రసాద్ యాదవ్ కి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో నితీష్ కుమార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటీ నాన్సెన్స్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఓ సీఎం పైనే చెప్పులు విసరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షనేతలు కుట్రపూరితంగా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆర్జేడీ నాయకులు ఆరోపిస్తున్నారు.