కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడి హత్య

Update: 2020-04-05 17:00 GMT
ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకరి తెలియకుండా మరొకరితో పడకసుఖం పంచుకుంది. ఫుల్లుగా వాడేసుకుంది. మొదటి ప్రియుడిని దూరం పెట్టింది. గట్టిగా నిలదీసే సరికి రెండో ప్రియుడితో కలిసి చంపింది. ఈ దారుణం కడప జిల్లాలో సంచలనమైంది.

కడప జిల్లా ముద్దనూరు మండలం బందలకుంట గ్రామానికి చెందిన నాగేశ్ భవన నిర్మాణ కార్మికుడు. తన కింద పనికి వచ్చే చిలమకూరు గ్రామానికి చెందిన వరలక్ష్మీతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో వీరిద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేసేవారు.

అయితే వరలక్ష్మీకి అప్పటికే  వెంకట గంగాధర్ అనే వ్యక్తితోనూ అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే నాగేశ్ ను దూరంపెట్టింది. అనుమానం వచ్చిన నాగేశ్ గట్టిగా నిలదీశాడు. దీంతో తన అక్రమ సంబంధాలకు నాగేశ్ అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని చంపేందుకు మరో ప్రియుడితో కలిసి వరలక్ష్మీ కుట్ర పన్నింది.

మార్చి 27న కడపలో ఉన్నానని.. ఇక్కడి వచ్చి తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని వరలక్ష్మీ ఫోన్ చేసి నాగేశ్ కు వలపు వల విసిరింది. నమ్మి బైక్ పై వచ్చిన నాగేశ్ ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. ఇక అక్కడ ఏకాంతంగా ఉండగా.. వీరి వెనుకాలే వచ్చిన వెంకట గంగాధర్ నాగేశ్ మెడకు టవల్ చుట్టి చంపేశాడు. వరలక్ష్మీ సహకరించింది. నాగేశ్ ను చంపి అతడి బంగారం గొలుసు - ఉంగరం ఎత్తుకొని పారిపోయారు.

మామిడితోటలో శవం గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతుడి వివరాలు తెలుసుకొని విచారించగా వరలక్ష్మీ బాగోతం బయటపడింది. ఆమెను విచారించగా నేరం ఒప్పుకుంది. ఇలా అక్రమ సంబంధం ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది.


Tags:    

Similar News