మరో కేంద్రమంత్రికి కరోనా

Update: 2020-08-12 17:00 GMT
కరోనా కబళిస్తోంది. వరుసగా ప్రముఖులను ఆవహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఎక్కువశాతం మందికి సోకుతోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

కేంద్రంలో వరుసగా కేంద్రమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు కరోనా బారినపడ్డారు.

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు ఈ కరోనా బారిన పడగా.. తాజాగా ఆయూష్ కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు.. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
Tags:    

Similar News