కుక్కలకు బిస్కెట్లలా.. కేరళ మంత్రి దారుణం..

Update: 2018-08-20 11:44 GMT
కేరళ బాధితులకు ఇప్పుడు తిండి - నీరు దొరక్క సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.. వరద బాధితుల కోసం ప్రభుత్వాలు - స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే  కర్ణాటకలో కూడా ఈ వరదతో తీవ్ర నష్టం వాటిల్లింది. వీరిని ఆదుకునే విషయంలో సీఎం కుమారస్వామి సోదరుడు - మంత్రి రేవణ్ణ వ్యవహరించిన తీరు చూసి అందరూ ఛీ కొడుతున్నారు. అసలు మనిషిలా ప్రవర్తించలేదని  సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

కేరళకు బార్డర్ లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు - హాసన్ - మైసూర్ జిల్లాల్లో కూడా వరదలు పోటెత్తాయి. వరద బాధితులు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వారికి మంచినీళ్లు - దుస్తులు - ఆహారం అందించేందుకు వెళ్లిన మంత్రి రేవణ్ణ రామనాథపురంలోని శిబిరంలో బిస్కెట్ ప్యాకెట్లను వరద బాధితుల చేతికి ఇవ్వకుండా వారి ఎదుట విసిరేవాడు. వీధి కుక్కలకు విసిరేసినట్లు విసరడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేవణ్ణ వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరును చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News