గుళ్లోనే మూడు రోజులున్న ముఖ్యమంత్రి?

Update: 2015-08-01 16:25 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి నమ్మకాలు మామూలే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నే చూస్తే.. ఇద్దరు చంద్రుళ్లు నమ్మకాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లలిత్ మోడీ వ్యవహారంలో పదవి పోగొట్టుకునే వరకు వెళ్లిన ముఖ్యమంత్రి వసుంధరా రాజే తాజాగా చేపట్టిన ఒక కార్యక్రమం ఇప్పుడు ఆస్తికరంగా మారింది. ఆమె రాజకీయ వివాదాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. అందులో నుంచి బయటపడేందుకు తాజాగా ఒక దేవాలయంలో మూడు రోజులు పాటు గడిపిన సమాచారం బయటకు వచ్చింది.

మధ్యప్రదేశ్ లోని దౌతియాలోని మా పితాంబర దేవాలయంలో మూడు రోజులు గడిపినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనగా చెబుతున్నప్పటికీ.. లలిత్ మోడీ వివాదంలోనుంచి బయటపడేందుకే ఇలా దేవాలయంలో గడిపినట్లుగా చెబుతున్నారు. జూలై 29న వచ్చిన వసుంధర రాజె.. జూలై 31 వరకూ దేవాలయంలోనే గడిపినట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. పూజలు చేస్తేనే.. వివాదాలు.. తలనొప్పులు సమిసిపోతే.. గుడి చుట్టూ తిరిగితే సరిపోతుంది కదా?
Tags:    

Similar News