దేశంలోనే అతిపెద్ద హవాలా కేసు

Update: 2020-09-03 08:50 GMT
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరిగినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. అతిపెద్ద హవాలా అక్రమ డబ్బుగా దీన్ని నిర్ధారించారు. ఢిల్లీకి చెందిన డీలర్ నరేష్ జైన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

దేశంలోనే అతిపెద్ద హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో ఒకటిగా ఇది తెలుస్తోంది.షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పలు విదేశీ వ్యాపారాలతో సహా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితుల వివరాలు త్వరలోనే బయటపెడుతామన్నారు.

కొన్నాళ్లుగా నరేశ్ జైన్ పలు సంస్థలకు అక్రమంగా హవాలా డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. గతంలో ఇతడిపై ఈడీ సహా పలు కేసులు ఉన్నాయి. బోగస్ కంపెనీల ద్వారా వేల కోట్లు విదేశాలకు దారి మళ్లించినట్లు నోటీసులు జారీ చేసింది.
Tags:    

Similar News