అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం అందించిన గవర్నర్ కూతురు !

Update: 2021-10-12 08:58 GMT
అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 16ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో అలయ్ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దసరా మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నాడు.

ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్నందున ప్రముఖులను దత్తాత్రేయ కూతురు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించలేదు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దత్తాత్రేయ గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఈ యేడాది అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. నిన్న పవన్‌ను కలిసిన విజయలక్ష్మి ఆహ్వాన పత్రిక అందించి తప్పకుండా రావాల్సిందిగా కోరారు. బండారు దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఆయన కుమార్తె ఆధ్వర్యంలో అలయ్ బలయ్ జరగబోతోంది.


Tags:    

Similar News