ఫారిన్ లోని ఆ సీఎం కొడుక్కి సుస్తీ

Update: 2016-07-28 06:58 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురైనట్లుగా చెబుతున్నారు. సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నారు. ప్యాంక్రియాసిస్ కు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న అతగాడు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని.. తన కుమారుడికి చక్కటి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు.

దీనికి సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారు. బెల్జియంలోని రాయబార కార్యాలయ ఉద్యోగులతో మాట్లాడిన ఆమె రాకేశ్ ఆరోగ్య పరిస్థితుల గురించి వాకబు చేయటంతో పాటు.. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు.. తన ఫ్యామిలీ డాక్టర్లను సిద్ధరామయ్య హుటాహుటిన బెల్జియంకు పంపారు. వారు భారత కాలమానం ప్రకారం గురువారానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం కొడుకు కోసం బెల్జియం బయలుదేరి వెళ్లారు. ఆయన కుమారుడికి అంతా మంచే జరగాలని కోరుకుందాం.
Tags:    

Similar News