భోపాల్ లో షాకింగ్ రేప్.. కదులుతున్న రైల్లో గ్యాంగ్ రేప్

Update: 2022-02-13 04:51 GMT
దారుణ అత్యాచార ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. గ్యాంగ్ రేప్ బారిన పడిన 21 ఏళ్ల బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు యశ్వంత్ పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు వెళుతుండగా 21 ఏళ్ల ఒక యువతి రైలు ఎక్కింది.

అయితే.. అందులో ఆమెకు సీటు లభించలేదు. దీంతో.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి.. ప్యాట్రీ కార్ లో ఖాళీ జాగా ఉందని.. అక్కడ కూర్చోవచ్చని నమ్మించాడు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన ఆమె.. కాసేపటికి నిద్ర పట్టింది. ఈ సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ గ్యాంగ్ రేప్ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే వారు భోపాల్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ట్రైన్ లోని వంట గది తలుపు తీయగా.. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి.. వైద్యం చేస్తున్నారు.

ప్రస్తుతం స్పృహలోకి వచ్చిన బాధితురాలు.. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు జరిగిన ఉదంతం మొత్తాన్ని వివరించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో దాదాపు 15 మందికి పైగా చిరు వ్యాపారుల్ని గుర్తించి అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరోవైపు పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.కదులుతున్న రైల్లో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ రైల్వే వర్గాలకు ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది.
Tags:    

Similar News