షర్మిల ప్రచారం…మంగళగిరి నుంచే మొదలు!

Update: 2019-03-25 08:18 GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రెస్  మీట్ పెట్టి స్పందించిన వైఎస్ షర్మిల ఇప్పుడు  ఎన్నికల ప్రచారానికి కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి వైఎస్ షర్మిల ప్రత్యక్ష ప్రచారం మొదలు కానుందని సమాచారం.

విశేషం ఏమిటంటే.. వైఎస్ షర్మిల ప్రచారం మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదలు కాబోతోంది. మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ - టీడీపీల మధ్యన టఫ్ ఫైట్ సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో పట్టు వదలకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే గట్టిగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల అక్కడ ప్రచార సభకు రావడం ఆసక్తిదాయకంగా మారింది. మంగళగిరితోనే ఆమె ప్రచారం మొదలు పెడుతూ ఉన్నారు. ఒకవైపు జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున కవర్ చేస్తూ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో జగన్ ప్రచారహోరు మరింత పెరగనుందని తెలుస్తోంది.

జగన్ కవర్ చేయని కొన్ని నియోజకవర్గాలను షర్మిల కవర్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టబోతున్నారని సమాచారం. జగన్ వెళ్లలేని నియోజకవర్గాలనే వీరు ప్రధానంగా కవర్ చేయబోతున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News