సంచయిత మరో సంచలన నిర్ణయం.. !

Update: 2020-12-28 07:45 GMT
మాన్సస్​ ట్రస్ట్​ చైర్​పర్సన్​ సంచయిత.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ట్రస్ట్ చైర్​పర్సన్​గా ఆమె ఎన్నిక దగ్గరి నుంచి విజయనగరం ట్రస్ట్​ వ్యవహారాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో ఆ ట్రస్ట్ టీడీపీ నేత అశోకగజపతిరాజు ఆధీనంలో ఉండేది. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, గతంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు విజయనగరంలో బలమైన  నేత. చంద్రబాబునాయుడుకు అత్యంత నమ్మకస్తుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే మాన్సస్​ ట్రస్ట్​ చైర్మన్​గా ఆయన ఉన్న కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ట్రస్ట్​ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం.. పరోక్షంగా జోక్యం చేసుకొని ఆయనను ట్రస్ట్​ కార్యకలాపాల నుంచి తప్పించింది.

ఆ స్థానంలో అదే కుటుంబానికి చెందిన సంచయిత బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టాక ట్రస్ట్ వ్యవహారం ఏపీలోనే హాట్​ టాపిక్​గా మారాయి. ట్రస్ట్​ చైర్మన్​గా ఆమె నియామకం కావడాన్ని అశోకగజపతిరాజుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్​ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. అశోకగజపతిరాజు అస్సలు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. మరోవైపు తనమీద వచ్చిన ఆరోపణలను సంచయిత దీటుగా ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు, లోకేశ్​కు సైతం ఆమె ఘాటుగా కౌంటర్​ ఇచ్చారు.

 అయితే తాజాగా సంచయిత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకూ మాన్సస్ రెవెన్యూ కార్యాలయం విజయనగరం రాజాగారి కోటలోనే ఉంది. అయితే ఈ కార్యాలయాన్ని ఆమె విశాకజిల్లాకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ మెమో విడుదల చేసింది మాన్సస్​ యజమాన్యం. పద్మనాభం మండలంలోని మూడున్నర ఎకరాలలో ఉన్న ఎమ్ ఆర్ వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలకు ఈ రెవెన్యూ కార్యాలయాన్ని తరలించనున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమలు అవుతుందంటూ మెమోలో పేర్కొన్నారు. చైర్​పర్సన్ సంచయిత గజపతి రాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెమోలపై సంతకాలు చేశారు. 1958 లో పీవీజీ రాజు స్థాపించిన మాన్సస్ రెవెన్యూ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయంపై గజపతిరాజుల కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Tags:    

Similar News