అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల హావా ... మూడో సారి గెలిచిన రాజా కృష్ణమూర్తి

Update: 2020-11-04 10:50 GMT
భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తిని వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నుకున్నారు. ఢిల్లీ లో జన్మించిన కృష్ణమూర్తి, లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్‌ ను సులభంగా ఓడించారు. ఆయనకు దాదాపు 71 శాతం ఓట్లు వచ్చాయి. 47 కృష్ణ మూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. మొదటిసారి 2016 లో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా కాలిఫోర్నియా నుండి వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసారు. కాంగ్రెస్ సభ్యురాలు… మహిళ ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ రాష్ట్రం నుండి వరుసగా మూడోసారి విజయం కోసం కష్ట పడుతున్నారు. కాలిఫోర్నియా మరియు వాషింగ్టన్ రాష్ట్రాలలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది.

 ప్రస్తుతం ఆయన తన ప్రత్యర్థి బజ్‌ ప్యాటర్సన్‌ కంటే దాదాపు 30 శాతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన తన ప్రత్యర్థిపై 50 శాతానికి పైగా లీడ్‌లో ఉన్నారు. వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్‌ మూడోసారి గెలుపొందారు. వీరంతా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.  భారతీయ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు విజయం సాధిస్తున్నారు.
Tags:    

Similar News