'అనంత' టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు

Update: 2020-12-05 11:33 GMT
అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది.

తాజాగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జేసీ పవన్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడంతో ఈ వివాదాలు బయటపడ్డాయి. తన అనుమతి లేకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనమైంది. అంతేకాదు జేసీ పవన్ రెడ్డిని ఓ శకునిగా ప్రభాకర్ చౌదరి అభివర్ణించారు.

తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిప్పులు చెరిగారు. ‘తాడిపత్రిలో టీడీపీని నాశనం చేశారని.. ఇప్పుడు అనంతపురంలో టీడీపీని నాశనం చేసేందుకు తిరుగుతున్నారని’ జేసీ పవన్ పై ప్రభాకర్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జేసీ పవన్ తన నియోజకవర్గంలో వేలుపెట్టి నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు.. సొంత పార్టీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి వర్గంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమంటూ ప్రభాకర్ చౌదరి సవాల్ విసరడం రాజకీయంగా సంచలనమైంది..
Tags:    

Similar News